గోడ కూలి ఏడుగురు మృతి. ఘటనపై: CM ఆరా..!
TG: హైదరాబాద్ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షం వల్ల గోడ కూలి ప్రమాదం జరిగిందని CMకు అధికారులు తెలిపారు.